అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

9/18/10

దీని భావమేమి వెంకటేశా!!!!!!!!!!!!!!!!!!!!!!!!!


ఇమేజి పెద్దదిగా చేయుటకు డాని మీద క్లిక్ చేయండి. senyumkenyit


ముందు రోజు రాత్రి ప్రమాదవనం లొ ఇలా



ఈ ఉదయం బజ్ లొ ఇలా

9/17/10

పాపం 'తార'కెన్ని కష్టాలు :P

బ్లాగులు చదివే వారిలో అసైన్సు కబుర్లు తార తెలీని వాళ్ళు ఉండరు. అయితే ఈ తారకి వచ్చిన కష్టాలు అన్ని ఇన్ని కావు. బ్లాగు లోకం లొ ఎవరూ ఎదుర్కోనన్ని నీలాపనిందలు ఎదుర్కొన్న మన తార .......యెంత మంది చవితి చంద్రులను దర్శించాడో గాని! ......... ప్రపీసస పుట్టిన కొత్తలో నేను అందులో తార అంటే అమ్మాయి అనుకుని మన నాగ ప్రసాద్ ని అడిగా "ఎవరా అమ్మాయి" అని ... 33 సార్లు gelakguling ఇలా పొర్లి పొర్లి నవ్విన నాగప్రసాద్ "అమ్మాయి కాదు అబ్బాయి"అని చెప్పాడు. కానీ అప్పటికే మెజారిటీ బ్లాగు లోకం తార ని అమ్మయిగానే గుర్తిస్తు వస్తుంది అప్పటి దాకా. అయితే ఇంగ్లీషు లొ స్టార్ అని ఉంటే అబ్బాయి అని తెలుగులో తార అని ఉంటే అమ్మాయి అనుకోవడం మన అవివేకం అనేది నా అభిప్రాయం.

ఇక ప్రజలు అప్పటికే అమ్మాయి అని అపార్ధం చేసుకున్న తార ని మొన్న ఒకాయన "బాబు యోగి అంటే నువ్వే కదా" అని అడిగాడట. దెబ్బకి దిమ్మ తిరిగిన తార ఆయనకి అసలు విషయం అర్ధం అయ్యేలా చెప్పి బయటికి వచ్చె సరికి విమల్ రెడీగా ఉన్నాడు . "హే తార బ్లాగు బాబ్జి నువ్వే కదా" అని టీనేజి పిల్లాడు విమల్ అమాయకంగా అడిగేసరికి మన తార గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. నేను బ్లాగు బాబ్జీ ని కాను మొర్రో అని మొత్తుకుని అక్కడి నుండి బయట పడ్డ తార నేరుగా బ్లాగు బాబ్జి దగ్గర ఈ విషయమై కామెంట్ పెడదామని వెళ్లాడు . అక్కడ తారని చూసిన బ్లాగు బాబ్జి .....................................
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

"అన్నాయి మార్తాండ అంటే నువ్వే కదా" అని అడిగేశాడు ihikhik. పాపం తార :P

9/16/10

ఒరేయ్ మీరు మారర్రా - మీరు మారరు

నిన్ననే ఒక టపా రాశాను ... కామెడీగా రాశాను కానీ అందులో కొని నిజం అవుతాయనుకోలేదు వా nangih ..

ఈ కింది లింక్ చూడండి . జగన్ కి కన్ను బాలేక ఓదార్పు ఆగడం వల్ల ముగ్గురు ఫట్ . ముందు సాక్షికి సలాం చెయ్యాలి :(

http://sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=11677&subcatid=16&Categoryid=3



‘గుండె’ చెదిరిన అభిమానం





ఒంగోలు మున్సిపాలిటీ, న్యూస్‌లైన్ : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనారోగ్య కారణంతో ఓదార్పు యాత్ర వాయిదా పడడంతో కలత చెంది ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం ఒంగోలు పట్టణంలోని విజయనగర్ కాలనీలో చోటుచేసుకుంది. సంతనూతలపాడు మండలానికి చెందిన తమ్మిశెట్టి నాగరాజు(22)మృతి చెందాడు. ఆ యువకుని తల్లిదండ్రులు బుధవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వైవీ సుబ్బారెడ్డిని కలిసి వారి ఆవేదనను చెప్పుకున్నారు.

మృతుడి తల్లిదండ్రులు రామలక్ష్మయ్య, రమణ చెప్పిన వివరాల ప్రకారం.. ఆ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉంది. ఒక కొడుకు అంకమరాజు ఏడాది క్రితం పోలియో వ్యాధితో మృతి చెందాడు. పెద్దబ్బాయి నాగరాజు పదేళ్లు వచ్చాక పోలియో సోకింది. వైఎస్‌ఆర్ హయాంలో నాగరాజుకు పింఛన్ మంజూరయింది. దీంతో వైఎస్‌ఆర్ మీద నాగరాజు అభిమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం దెబ్బతిని ఓదార్పుయాత్ర వాయిదా పడడంతో నాగరాజు ఆవేదన చెందాడు. హఠాన్మరణం చెందాడు. ఆదుకుంటామని సుబ్బారెడ్డి వారికి హామీ ఇచ్చారు.

వైఎస్ అభిమాని గుండెపోటుతో మృతి
మేదరమెట్ల, న్యూస్‌లైన్ : జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహిస్తున్న కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనారోగ్యానికి గురవడంతో మనస్తాపం చెంది ఓ వ్యక్తి చనిపోయాడు. కొరిశపాడు మండలం యరబ్రాలేనికి చెందిన కోటపూడి వెంకటేశ్వర్లు(59) మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో టీవీలో ఓదార్పు యాత్ర వార్తలు చూస్తూ ఉద్వేగానికి గురై గుండెపోటుతో మృతి చెందారు. ఇతను వైఎస్‌ఆర్ వీరాభిమాని. కూలి పని చేసుకొని కుటుంబాన్ని పోషిస్తున్నారు. వైఎస్ మృతి చెందినప్పుడే రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోతుందేమోనని తీవ్రంగా బాధపడ్డాడని అతని భార్య సౌభాగ్యం ‘న్యూస్‌లైన్’తో చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి అయితే వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఢోకా ఉండదని చెబుతుండేవాడన్నారు.


వైఎస్‌ఆర్ విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడంపై ఆగిన గుండె
కందుకూరు : జననేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఏర్పాటును అడ్డుకోవడంపై కలత చెంది ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. వలేటివారిపాలెం మండలం శాఖవరంలో వైఎస్‌ఆర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు మూడు రోజుల నుంచి ఆ గ్రామానికి చెందిన దళితులు ప్రయత్నం చేస్తున్నారు. వివాదంలో ఉన్న పంచాయతీ స్థలంలో విగ్రహ ఏర్పాటును అగ్రవర్ణాలకు చెందిన కొందరు అడ్డుకున్నారు. భూమి పూజను కూడా నిలిపివేశారు. తమ అభిమాన నేత విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడంతో గడ్డం అచ్చయ్య(62) తీవ్రంగా బాధపడ్డాడు. బుధవారం సాయంత్రం 4 గంటలకు గుండె పోటుతో మరణించాడు. మృతునికి భార్య, వివాహమైన కుమార్తె ఉంది. వైఎస్‌ఆర్ విగ్రహ ఏర్పాటుకు కమిటీ తరఫున అచ్చయ్య తీవ్రంగా కృషి చేశారు. అది విఫలం కావడంతో వేదన చెంది గుండెపోటుతో మరణించాడు.

9/15/10

జగన్.... నవ్వుల పాలు కాకముందే ఈ హత్యలు మానెయ్యి

మరణించిన వారి కోసం జగన్ చేస్తున్న ఓదార్పు యాత్ర జరగదేమో అన్న బెంగతో ఇప్పటికే మా జిల్లాలో చాలామంది చనిపోయారు. తాజాగా వై ఎస్ విగ్రహాలు తమ గ్రామం లొ పెట్టరేమో అనే బాధతోను , పెట్టడం కుదరడం లేదు అన్న బాధతోను గుండెపోటు వచ్చి చాలా మంది చనిపోతున్నారు. వీళ్ళందరినీ ఓదార్చుకుంటూ పోతే ఇక జగన్ మా జిల్లా దాటలేడు. ఇంకొన్నాళ్ళు పోతే తమ కేబుల్ లొ సాక్షి ఛానల్ రావడం లేదనే బాధతో ఒకడు, సాక్షి లొ పేపర్ ల సంఖ్య తగ్గిందని ఇంకొకడూ కూడా చస్తారేమో !!!!!!!!!!!!!!.

అసలు జగన్ ఒదార్చాల్సిన కుటుంబాలు ఉన్న గ్రామాలు కాకుండా వేరే గ్రామాలలో పర్యటించడం లొ తన హిడెన్ ఎజెండా తేటతెల్లం అయింది. అందులో భాగంగా తమకు రెగ్యులర్ గా అలవాటు అయిన మరణాల ఫార్ములా ని మళ్లీ తెర మీదకి తెచ్చారు. జగన్ తమ గ్రామానికి రాడేమో అన్న బెంగతో ఒకాయన మరణించడంతో మొదలైన కామెడీ అప్రతిహతంగా కొనసాగుతుంది. నిన్నటికి నిన్న జగన్ మా గ్రామానికి రాకపోతే కనీసం 20 దాకా చచ్చిపోతాం అని సాక్షి లొ ఒక యువకుడు రెచ్చిపోయాడు. తాజాగా ఈ రోజు తమ గ్రామంలో వైఎస్ విగ్రహం పెట్టరేమో అన్న బాధతో ఒక వీరాభిమాని మరణించడంతో కామెడీ తారా స్థాయికి చేరింది. నేను మరణించిన వ్యక్తిని ఇక్కడ అపహాస్యం చేయడం లేదు . సహజ మరణాలని తమకు అనుకూలమైన కారణాలకు మలుచుకుంటున్న పార్టీలు రేపు అవసరమైతే జనాన్ని చంపి తమ అవసరాలకి వాడుకునే దిశగా అడుగులు వేయకముందే ఈ కామెడీ మరణాలకి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది . ముఖ్యంగా జగన్ ఇప్పటికే ఈ చావుల వ్యవహారం లొ పలుచన అవుతున్నాడు. ఇంకా జనాల్లో చులకన కాకుండా ఉండాలంటే ఈ హత్యల సంస్క్రుతి కి జగన్ చరమ గీతం పాడాల్సిందే .

9/13/10

రాజేష్ --- ఫైనాన్స్ మేనేజ్మెంట్

ఒకసారి రాజేష్ కి బాగా ఆకలిగా ఉంది . ఎదురుగా ఉన్న ఫైవ్ స్టార్ హోటల్  లొ భోజనం చేయాలనీ కోరికగా ఉంది కానీ తన వద్ద  వంద రూపాయలే ఉన్నాయి. యెలా యెలా అనుకుంటుండగా రాజేష్ కి ఒక మెరుపులాంటి ఐడియా తట్టింది. వెంటనే హోటల్ కి వెళ్లాడు కావాల్సినవన్నీ ఆర్డర్ చేశాడు . బాగా మెక్కిన తర్వాత బిల్ చూస్తే రెండు వేలు అయి ఉంది.   అప్పుడు బేరర్ తో నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పాడు రాజేష్.  వెంటనే హోటల్ మేనేజర్ పోలీసులని పిలిచి రాజేష్ ని వాళ్లకి అప్పగించాడు. పోలీసులు రాజేష్ ని తీసుకెళ్ళారు.

తన వద్ద ఉన్న  ఆ వంద పోలీసులకి లంచంగా ఇచ్చి ఖుషీగా వెళ్ళిపోయాడు రాజేష్ .

9/9/10

దొంగ నా కొడుకు ఫైన్ వేసాడన్నా..

"దొంగనాకొడుకు రెండు వందలు దొబ్బాడు .. ఈడెమ్మ .. చి ... అనవసరంగా పోయి వాడి చేతిలో పడ్డాను" అంటూ తెగ అరుస్తున్నాడు నాగి అనబడే మా ఆస్థాన మెకానిక్ నాగేశ్వరరావు. "ఏమైంది నాగి" అన్నాను . "కొత్త ట్రాఫిక్ ఎస్సై అంట అన్నా నా కొడుకు నేను ఫోన్ మాట్లాడట బండి మీద పోతా ఉన్నా రోడ్డు పక్కన వాడు ఉన్నాడు గావాల నేను చూసుకోలా ఆపి రెండు వందలు ఫైన్ వేసాడు " అంటూ తన బాధ మొత్తం చెప్పాడు నాగి. " అదేంది నాగి ఆలా అంటావ్ మరి నువ్వు ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చెయ్యడం తప్పు కదా" నా మాట సగం లో ఉండగానే అక్కడ ఉన్న మరో ముగ్గురు నాతో వాదనకి దిగారు. " ఏందన్న తప్పు , మొన్న నన్ను ఆపి లైసెన్స్ అడిగాడు లేదు అని చెప్పా , ఇంటికెళ్ళితెమ్మన్నాడు .. లేదు అని చెప్పా నాలుగువందలు ఫైన్ రాసి .. స్టేషన్ కి వచ్చి బండి తీసుకెళ్ళమన్నాడు అన్నా" అన్నాడు ఇంకొకడు. " అదేన్దయ్యా మీరు చేసింది తప్పు అతను చేసింది కరక్ట్ " అని నేను ఎంత మొత్తుకున్నా నా మాట వినే నాధుడు లేడు. పైగా నన్ను పిచ్చివాడిని చూసినట్టు చూడడం మొదలెట్టారు. ఆ రోజు మొదలు ఆ ఎస్సై గురించి నేను రోజు ఎక్కడో దగ్గిర తిట్లు వినే వాడిని . అతను చేసిన పనల్లా తన డ్యూటి తను చెయ్యడమే. సాక్షాత్తు ఎక్సైజ్ శాఖ ఎస్పి కారు కి పేపర్లు లేవన్న కారణం చేత పదివేలు ఫైన్ వేసిన ఘనుడు. కొందరు ప్రజాప్రతినిధులు ఒక ఫంక్షన్ కి వచ్చి రోడ్డుకి అడ్డంగా బండ్లు పెట్టి ట్రాఫిక్ కి అంతరాయం కలిగించిన కారణం చేత బండి తీయమంటే .... డ్రైవర్లు పెడసరంగా సమాధానం ఇవ్వడంతో ఆ కార్లకి గాలి తీసి ఎమ్యెల్యే , మునిసిపల్ చైర్మన్ లని రోడ్డు మీద నిలబెట్టిన చరిత్ర ఉంది అతనికి. అయితే తన డ్యూటి తను చేయడం వల్ల అతని కింది ఉద్యోగస్తులు అతను హెరాస్ చేస్తున్నాడు అని తిట్టేవారు. అంటే మనం ఎలా వెళ్ళినా , ఏం చేసినా పర్లేదు పోలీసులు పట్టుకోకూడదు ఫైన్ వెయ్యకూడదు అన్న భావన చాలా శాతం ప్రజల్లో ఉంది నాకు తెల్సి. ఇలాంటి ప్రజలకి మళ్లా అవినీతి అధికారులని ప్రశ్నించే హక్కు ఎక్కడి నుండి వస్తుంది.

మరొక కేసులో జరిగిన ఇంకొక తమాషా చూద్దాం. మా ఇల్లు ఇండేన్ గ్యాస్ ఆఫీస్ కి దగ్గర లో ఉంది. ఒకరోజు ఉదయాన్నేఒక పెద్ద మనిషి బండ బూతులు తిడుతున్నాడు ఆ గ్యాస్ కంపెనీ ముందు. "ఏంటయ్యా నీ గోల " అంటే "రేషన్ కార్డ్ లో గ్యాస్ నెంబర్ లేకపోతే గ్యాస్ ఇవ్వరంట సార్" అని ఆవేశంగా అడుగుతున్నాడు. "మరి నిజమే కదయ్యా రేషన్ కార్డ్ లో గ్యాస్ నెంబర్ చేర్పించుకోవాలి కదా ఎందుకు చేర్పించుకోలేదు" అని అడిగితే నీళ్ళు నమిలి "అప్పుడేదో ఆలా అయిపొయింది సార్ కానీ ఇపుకు కొత్త జాయింట్ కలెక్టర్ ఈ రూలు పెట్టడం తప్పు సార్ "అన్నాడు. అతనొక్కడే కాదు గంట గడిచే సరికి ఆ గ్యాస్ ఆఫీస్ డివిజన్ కింద ఉండే ఖాతా దారుల్లో తొంబై శాతం మంది అక్కడికి చేరి గొడవ మొదలు పెట్టారు. కారణం వారు ఎవరూ రేషన్ కార్డ్ లో తమకు గ్యాస్ ఉంది చెప్పకుండా...... కిరోసిన్ కూపన్లు పొంది , రేషన్ షాపు లో కిరోసిన్ చవగ్గా కొట్టేసి అధిక ధరకు పక్కన అమ్ముకోవడం మరిగారు . అందరూ మద్య తరగతి ప్రజలే . తాము చేసింది తప్పు అని ఒప్పుకోకుండా గొడవకి దిగి చివరికి ఆ రూల్ తీసిన్దాకా గొడవ చేశారు అంటే జనాలు ఏ స్థాయి లో ఉన్నారు?

మరొక చోట తనకి వికలాంగ పించన్ అపేసినందుకు అధికారులని బండబూతులు తిడతాడు ఏ రకమైన అంగ వైకల్యమూ లేని ఒక చవట. గవర్నమెంటు వారు విద్యార్ధులకి స్కాలర్ షిప్ ఇస్తున్నారు అని తెల్సి అప్లికేషన్ లో తన సంవత్సర ఆదాయం 24000/- గా నమోదు చేయించిన ఒక పల్సర్ 220 మీద రేబాన్ గ్లాసులు పెట్టి తిరిగే ఇంకొక చదువుకున్న దద్దమ్మ ని చూస్తె అరికాలి మంట నెత్తికి ఎక్కుతుంది.


అవినీతి కేవలం రాజకీయ నాయకుల దగ్గరే ఉందా , అధికారులు ఉద్యోగుల దగ్గరే ఉందా ??? జనం లో లేదా?

మీకు ఒక కొస మెరుపు చెప్పనా .... అప్పటిదాకా గాలికి తిరిగిన ఒక మిత్రుడు లేటు వయసులో "లా" చదవడం మొదలెట్టాడు. ఎందుకు అన్నా ఇప్పుడు నీకీ అవస్థ అంటే ?? లేదురా చదివితే రేపు ఎవడు ఇల్లు కట్టుకుంటున్నా ఏదో ఒక క్లాజ్ పెట్టి కేసు వేసి నోటీస్ ఇవ్వచ్చు , వాడు ప్రైవేట్ సెటిల్ మెంట్ కి వచ్చి ఎంతోకంత ముట్ట చెబుతాడు ఆలా సంపాదించుకోవచ్చు .. అసలు ఒక సినిమా మీద గోల చెయ్యొచ్చు .... ఒక పుస్తకం రాసిన వాడి మీద కేసు పెట్టొచ్చు ... అసలేమీ సంబంధం లేకుండా నీ స్థలం లోకి నిను అడుగు పెట్టనీకుండా అపెయోచ్చు ఇలా ఎన్ని చేయోచ్చ్చో అని ఆవేశంగా ఆనందంగా చెబుతున్న ఆ మిత్రుడి మొహం లో నాకు భస్మాసురుడు కనిపించాడు అని చెప్పడం లో అతిశయోక్తి లేదేమో!

9/8/10

హిడెన్ కెమెరాల విషయం లో దొంగలు పడ్డ ఆరేళ్లకు టీవీ 9 మొరిగినా ......................

దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగితే ....అప్పటికే జరగాల్సిన డామేజి జరిగిపోయి ఉంటుంది . అలాగే హిడెన్ కెమెరాల విషయం లో టీవీ 9 ప్రసారం చేసిన కధనాలు చాలామందికి భయాన్ని కలిగించినా ఈ హిడెన్ కెమెరాల సంస్కృతి ప్రస్తుతం గ్రామాలకి సైతం పాకి పోయింది. ఒకప్పుడు ఆరుబయట స్త్రీ తన బిడ్డకి పాలిస్తుంటే అసలు పట్టించుకోకుండా వెళ్ళేవారట. మారుతున్న విలువల వల్ల ఇంతకు ముందు ఆడకూతురు ఇంట్లోనుండి బయటికి వస్తే ... తిరిగి ఇల్లు చేరే లోపు తన శరీరాన్ని గుచ్చి గుచ్చి చూసే అనేక వందల కళ్ళ మద్య లోనుండి నడవాలి అన్నది జగద్విఖితం. అయితే పదునాలుగేళ్ళ వయసు నుండి ఆ చూపులకి అలవాటు పడి మొదట్లో కాస్త ఇబ్బంది పడినా .........తర్వాత తర్వాత ఒకరకంగా ఆ చూపులను పట్టించుకోని విధంగా బండబారి పోయి ఉంటారు అమ్మాయిలు. అయితే ఆ కళ్ళ సరసన ఇపుడు మరో కన్ను వచ్చి చేరింది . అది చూడడమే కాదు చూసిన దాన్ని తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. అదే కెమేరా కన్ను.

కూర్చునప్పుడో , ఒంగినప్పుడో వస్త్రం కొద్దిగా పక్కకి జరిగితే చాలు అది కెమేరా కంట్లో పడిపోతుంది. కాలేజీలలో అమ్మాయిల టాయిలెట్లు , చెంజింగ్ రూమ్స్ , ట్రయల్ రూమ్స్ , ఇలా ఒకటేమిటి ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు పెట్టి షూట్ చేసి , వాటిని నెట్ లోకి ఎక్కించి అందరికీ చూపించి మజా చేసుకుంటున్న యువత ఒకటి మర్చిపోతుంది............రేపు అదే పరిస్థితిలో వారి అక్కో చెల్లో ఉంటే ?????????????? అపుడు పగిలే వాడి గుండె కి బాద్యులు ఎవరు. వాడి సంస్కృతి చేజేతులా నాశనం చేసుకున్న తర్వాత వాడు ఎంత ఏడిస్తే మటుకు ఎం లాభం. త్రిష లాంటి ఒక హీరోయిన్ స్నానం చేస్తున్న దృశ్యాలు ఎవరో చిత్రీకరిస్తే దాన్ని గంటలో ఒకటికి ఇరవై సార్లు తిప్పి తిప్పి ప్రసారం చేసిన టీవీ 9 ఈ రోజు పత్తిత్తు అయింది. tv9 సంగతి మనకి అనవసరం . ప్రస్తుతం మనకి కావాల్సింది మారుతున్న విలువల వల్ల మన తర్వాతి తరానికి కలిగే నష్టాలు బేరీజు వేసుకోవడం.

ముందుగా మేల్కోవడం మనకి కావాలి , ఎంత సేపు చరిత్ర గురించి పేరాలు పేరాలు రాసుకోవడం , ఇదేదో మనకి అర్ధం కాని గొడవ అని యువతరం పెడచెవిన పెట్టడం ....ఇదే జరుగుతుంది ప్రస్తుతం. ఎవడో మాక్స్ ముల్లర్ ఏదో రాశాడు , ఎవడో డల్హౌసీ మన సంస్కృతి మూలాలు కత్తిరించేందుకు శతాబ్దం క్రిందటే ప్రణాళిక రచించాడు అని అనుకోవడం తప్ప ... సంస్కృతి , విలువలు అనే భావన నుండి నేటి యువతరం చాలా దూరం వెళ్లి చాలా ఏళ్ళు అయింది అన్న విషయాన్ని ఎవరూ గుర్తించడం లేదు.

చీప్ గా కెమేరా ఉన్న ఫోన్ దొరికింది కదా అని అమ్మాయిల ప్రైవేట్ జీవితాలలోకి తొంగి చూసే యువత ఈ పెడ సంస్కృతి పెచ్చుమీరి రేపు ఎవడో తన భార్య తన కూతురు ని ఇలాగే చిత్రీకరించే అవకాశం ఉంది తను ఆవిధమైన అలవాట్లకి తనే వారధిగా మారబోతున్నాడు అన్న విషయం గుర్తించడం లేదు. మద్య వయసు మనుషులు కూడా రేపు ఇదే ప్లేస్ లో నా బిడ్డ ఉంటే ఏమవుతుంది అన్న ఆలోచనే లేకుండా ప్రవర్తిస్తున్నారు. చివరకు నగరాలలో ఆడవాళ్ళ మూత్రవిసర్జన శాలల్లో సైతం కెమేరా పెట్టేంత దారుణమైన స్థాయికి చేరుకున్నారు అంటే మనం ఎంత దిగజరిపోయాం అన్నది అర్ధం అవుతుంది.

దీనికి పరిష్కారం గా ప్రస్తుత తరం ఏమి చేయాలి అన్నది చర్చిద్దాం . అసలు మనది ఒక సంస్కృతే కాదు, ఆడవాళ్ళని గౌరవించండి అని చెప్పిన ఆర్యులు అసలు మనవాళ్ళు కాదు అని చెప్పే వాళ్ళని చూసి మనసులో తిట్టుకోవడం తప్ప మనం ఇంకేం చేయలేమా? యెంత సేపు విద్యావ్యవస్థ లో మార్పు కోసం యత్నించడం కాకుండా మన వంతుగా మన చుట్టూ ఉన్న పిల్లలకి విలువలు నేర్పించడం. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజలందుకుంటారు అన్న మాట పిల్లల మెదళ్ళలోకి ఎక్కేలా చెప్పడం ముఖ్యమైనది అని నా అభిప్రాయం. మన సంస్కృతి ఎలా నాశనం అయింది అన్న విషయాన్ని వారికీ విసుగు పుట్టని విధంగా తెలియచేసి .. ఒకనాటి మన వైభవాన్ని తిరిగి తెచ్చే బాధ్యత వారిమీదే ఉంది అన్నంతగా వారిని ప్రభావితం చేయడం అత్యవసరం. ఇది వందేళ్ళ పోరాటం. ఒక్కరోజులో సాధ్యపడేది కాదు. ఏ ప్రభుత్వం మీదో, ఏ వ్యవస్థ మీదో ఆధారపడక మంచిని కాంక్షించే ప్రతి మనిషి తన బాధ్యతగా దీన్ని గుర్తించి ఇప్పటినుండే అమలు పరచాల్సిన విషయం. ఇది మారాల్సిన సమయం ... ఇపుడైనా మనం మేల్కొకపోతే ... ఇప్పుడు రామాయణ మహాభారతాల మీద........ అవి నిజమా కాదా అని జరుగుతున్న చర్చలానే కొన్నేళ్ళ భూమిమీద స్వార్ధం లేని మనుషులు ఉండేవారట అప్పట్లో ఒకరికి ఒకరు సహాయం చేసుకునే వారట , స్త్రీలని గౌరవించేవారట , అసలు పెళ్లి అనే పద్ధతి ఉండేదట అనే అంశాల మీద భిన్న వాదోపవాదాలు నడిచే రోజు వస్తుంది.

ఇబ్బంది అనుకోకుండా ఒక్కసారి ఈ వీడియో చూశాక నేటి మెజారిటీ యువత ప్రస్తుత గురించి స్ప్రష్టమైన అవగాహన
వస్తుంది . ఆ వీడియోలో అంత అసభ్యత ఉండదు . ఒక మంచి మెసేజ్ ఇస్తుంది

9/7/10

అదే కారణం

ఒక ఊర్లో ఒక భార్య భర్త ఉన్నారు. వారి అన్యోన్య దాంపత్యం లోకి బి.పి. అనే రోగం ప్రవేశించింది. ఆరోగ్యం బాగోలేని కారణంగా ఆ భర్త డాక్టర్ ని సంప్రదిస్తే ... పరీక్షలు చేసిన డాక్టర్ అతనికి హై బి.పి ఉన్న కారణంగా ఆహార నీయమాలు పాటించాలని, ఉప్పు అసలు వాడకూడదు అని చెప్పాడు. అ రోజు నుండి అతని భార్య ఎంతో ప్రేమగా అతనికి కావాల్సిన అన్నీ సమకూరుస్తూ , అతనికి కావాల్సిన విధంగా ఉప్పు లేకుండా వంట చేస్తూ ఉండేది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ ఒకనాటి ఉదయాన్నే అతను బాత్ రూం లో అచేతనంగా పడి ఉన్నాడు . హుటా హుటిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లగా పరీక్షించిన డాక్టర్ ..... హై బిపి వలన అతను ఆలా పడిపోయాడని చెప్పారు . రెగ్యులర్ గా మందులు వాడుతున్నా , ఆహార నీయమాలు పాటిస్తున్నా అతనికి అంత ఉదయాన్నే అంత బి.పి ఎందుకు వచ్చిందో ఎవరికీ అర్ధం కాలేదు. చాలా పరిశోధనల తర్వాత డాక్టర్ కనిపెట్టిన విషయం ఏంటంటే
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.



వాళ్ళ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందిgelakguling

9/6/10

రాజేష్ రిటర్న్స్

అవి మేము ఇంటర్ చదివే రోజులు. మాది లాస్ట్ బెంచ్ బ్యాచ్. ఆ రోజుల్లోనే రాజేష్ ఒకమ్మాయిని ప్రేమించాడు... అదీ చాలా ఘాడంగా! అయితే ఆ పిల్లకి ఆ విషయం చెప్పడానికి ఆడికి భయం. సరిగ్గా అదే సమయంలో ఫరూక్ ఒక కత్తి లాంటి ఐడియా రాజేష్ కి ఇచ్చాడు. అదేంటంటే తన ప్రేమనంతా పేపర్ మీద పెట్టి ఆమెకి ఇవ్వమని. సరే అని చెప్పి వెళ్ళిన రాజేష్ రెండు రోజులకి ఫరూక్ దగ్గరకి వచ్చి ప్రేమని పేపర్ మీద పెట్టడం ఎలా అని ఎర్రి మొహం ఏసుకుని అడిగాడు. "చెత్తనాయాలా, చెత్తనాయాలా, చెత్తనాయాలా ( ఇక్కడ మూడు మొట్టికాయలు) ప్రేమని పేపర్ మీద పెట్టడం అంటే లవ్ లెటర్ రాయమని అర్ధం రా అని రాజేష్ కి అర్ధమయ్యేలా చెప్పాడు ఫరూక్. ప్రపంచం లో ఎవడూ రాయలేనన్ని తప్పులని ఆ లవ్ లెటర్ లో పొందు పరుస్తూ రాసిన రాజేష్ ఆ లెటర్ ని ఆ పిల్ల నోట్ నోట్ బుక్ లో ఫరూక్ సాయంతో పెట్టేశాడు. తన జీవితం లో అంత దారుణమైన ప్రేమలేఖ అంత చిన్న వయసులో చదవాల్సివస్తుంది అని కలలోనైనా ఊహించని ఆ అమ్మాయి ఆ లెటర్ ని ప్రిన్సిపాల్ కి అందచేసింది. మనోడు అ లెటర్ కింద సంతకం పెట్టి రోల్ నంబర్ కూడ వేసేశాడని వేరే చెప్పనవసరం లేదనుకుంటా .

ఆగ్రహించిన ప్రిన్సి మనోడిని ఆ పిల్ల ముందే సావగొట్టడంతోబాటు మూడు వారాల పాటు సస్పెండ్ కూడా చేశాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి వైపు చూడడానికే భయపడిన రాజేష్ ని చూసి జాలి పడిన అమ్మాయి కొన్నాళ్ళకి రాజేష్ ని ప్రేమించి ఆ ప్రేమని పేపర్ మీద పెట్టి రాజేష్ బుక్కు లో పెట్టింది. కానీ రాజేష్ ఆ రెండేళ్లలో ఆ అమ్మాయికి రిప్లై ఇవ్వలేదు కనీసం కన్నెత్తి చూడలేదు. కారణం
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

మనోడు అసలు పుస్తకం తెరిచిన పాపాన పోలేదు కాబట్టి.

9/3/10

టీవీ --> 9.1 క్రైం వాచ్ - కొన్ని కామెడీ సత్యాలు

ఇది చివరిదాకా చూసి ఒక్కసారి కూడా నవ్వకపోతే డాక్టర్ ని కలవాల్సిందే మరి