అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

5/10/10

జయసూర్యా..... నువ్ ఎంచుకున్న రాగమేంటి తెంచుకున్న తాళం ఏంటి

శీర్షిక చూడగానే మీకు కింగ్ సినిమా గుర్తు వచ్చి ఉండాలి . కింగ్ సినిమాలో శ్రీను వైట్ల అడ్డదిడ్డంగా ఎకిపారేసినా మనోడికి బుద్ధి రాలేదు కావాలంటే మీరే చూడండి.




ఇప్పుడు ఇది చూడండి .... గోలీమార్ లో తను స్వరపరచిన పాట .




ఇంతకీ ఆ అన్నాయి ఎవరో కనుక్కున్నారా?

భారతీయ సమాజం - నాకు తెల్సిన విషయం

స్త్రీ పురుషుల మద్య స్నేహాన్నిసరిగా అర్ధం చేసుకోలేని పరిస్థితి గురించి చర్చ జరిగినప్పుడు కొన్ని విషయాలు గురించి తీవ్రంగా ఆలోచించడం జరిగింది. స్త్రీకి ఆర్ధిక స్వాతంత్రం లభిస్తున్న నేటి రోజుల్లో ఎవరేమి అనుకుంటే నాకేమి నా మనసు నాకు తెల్సు అని ధైర్యంగా ముందుకు పోగలిగిన పరిస్థితులు నేడు ఉత్పన్నం అయ్యాయి . దీనికి ఆర్ధిక స్వాతంత్రం ఒక కారణం అయితే అర్ధం చేస్కునే కుటుంబసభ్యులు మరొక కారణం గా మనం చెప్పుకోవచ్చు. కానీ ఆనాటి కాలం లో స్త్రీకి ఎ ఆర్ధిక ఆసరా గానీ , కుటుంబం నుండి అండదండలు గానీ అంతగా లభించనప్పుడు ఆమె పరిస్థితి ఏమిటి ??? అప్పట్లో మన వాళ్లకి కుటుంబ నియంత్రణ లేక పోవడం గంపలు గంపలు గా పిల్లలని కని పడేయడం వారిని పెంచలేక సతమతమవడం మొదలైన కారణాలు పీడిస్తున్నప్పుడే ... కొందరు ధనవంతులైన వృద్ధులు కన్నె పిల్లలను పెళ్లి చేసుకోవడం మొదలెట్టారు . అలాగే యుక్తవయస్సులో ఉన్న వారు కూడా వివాహం తగిన ఈడు జోడు ఉన్న వారు కూడా పెళ్లి చేసుకునే వారు . మొదటి కేసు లో వృద్ధుడైన భర్త మరణించినా అమ్మాయి చిన్న వయస్సులో విధవరాలయ్యేది. లేదా రెండవ కేసు విషయానికి వచ్చేసరికి ఆనాడు తగిన వైద్య సౌకర్యాలు లేక విషజ్వరాలు వంటివి సోకి మరణించడం వంటివి సంభవించేవి. ఔనన్నా కాదన్నా మనది అనాదిగా పితృస్వామ్య వ్యవస్థ . అమ్మాయి మరణిస్తే అబ్బాయి మరొక వివాహం చేసుకునే వాడు కానీ అబ్బాయి మరణిస్తే ఆమెను మరొకరు వివాహం ఆడేవారు కాదు . ఇక ఆమెకి అన్నీ కష్టాలే .

సరిగ్గా అటువంటి పరిస్థితే వచ్చినప్పుడు జరిగిన సంఘటన ఇపుడు మనం చదువుదాం . దత్తాత్రేయుడు అనే యువకునికి , సావిత్రి అని యువతికి ఘనం గా వివాహం జరిపించారు వారి తల్లి దండ్రులు. చాలా చక్కని సంసారం వారిది . అయితే కొన్నాళ్ళకి అ యువకునికి జబ్బు చేసి ఎన్ని మందులు వాడినా తగ్గగా పోగా నానాటికీ క్షీణించసాగాడు. చివరి ప్రయత్నగా గంధర్వపురం లో ఉండే శ్రీ నరసింహ సరస్వతీ వద్దకు తీసుకొస్తుండగా మార్గ మద్యలో ఆ యువకుడు మరణిస్తాడు. ఊరు కాని ఊరు లో భర్త శవం పై పడి ఆమె ఎడుస్తుండగా ఒక ముని వచ్చి ఆమెకు కొన్ని మంచి మాటలు చెప్పి స్వాంతన చేకూరుస్తాడు. అప్పుడు ఆమె తనకు మార్గం సూచించమని అడుగగా ఆమెకు బృహస్పతి వుపదేశించిన స్త్రీ ధర్మాలు చెబుతాడు. భర్త చనిపోయిన యావజ్జీవమూ విధవా ధర్మం పాటించడం ఉత్తమం (అప్పట్లో రెండో వివాహం ప్రసక్తి లేదు) ఇవన్నీ భర్త లేక తను బ్రతుకలేను అనుకునే వారికే . ఆ విధవా ధర్మాలు చాలా ఉత్తమం అయినవి. ఆమె తప్పని సరిగా జుట్టు తీయించుకోవాలి . లేదంటే జుట్టు అనే త్రాడుతో భర్త ను కట్టివేసినదోషం వస్తుంది . అమెతోబాటు మరణించిన ఆమె భర్త సైతం ఆ పాపాన్ని మోయవలసి వస్తుంది. నిత్యం తలస్నానం చేసి ఒంటి పూట భోజనం చేస్తూ ఉండాలి. వయసు మేడ పడిన వారు రెండవ పూట పాలు, ఫలములు భుజించవచ్చును. నేల మీదనే పడుకోవాలి. తెల్ల చీరలు ధరించాలి .. సుఘంధములు ,పూలు ధరించరాదు. వేసవికాలంలో నీరు దొరకని ప్రాంతాల్లో చలివేంద్రం పెట్టించాలి. వైశాఖమాసం లో జల దానం , కార్తీక మాసం లో దీప దానం , మాఘం లో నెయ్యి నువ్వులు దానం చేయడం శ్రేష్టం .. ఇలాంటి ధర్మాలు ఆచరిస్తే ఆమె స్వర్గానికి పోవడమే కాక మరణించిన ఆమె భర్త ఆత్మ సైతం శాంతిస్తుంది. ఇలా చేయలేని పక్షం లో పతివ్రతయైన స్త్రీ , తన భర్తను విడిచి బ్రతుకలేను అని భావించే స్త్రీ స్వర్గమునకు పోవలేనంటే సతీసహగమనం చేయడం ఉత్తమం అని చెబుతాడు. ఆమె గర్భవతి అయినా , లేక పసి బిడ్డలు ఉన్నా లేదా ఆమె దూర ప్రాంతమున ఉన్నా ఇటు వంటివి చేయకూడదు అని చెబుతాడు. దానికి సిద్ధపడి సహగమనం చేయదలచిన సావిత్రి భక్తికి మెచ్చి ఆమెని వారించి ఆమె భర్తను బ్రతికించాడు అన్నది కధ.

పై వాఖ్యాల సారాంశం........ భర్త లేని స్త్రీ ని ప్రస్తుత సమాజం ఎంత ఇబ్బంది పెడుతుందో మనకి తెల్సు . ఆ రోజుల్లో యవ్వనవతి , సౌందర్యవతి అయిన స్త్రీ కి వైధవ్యం కత్తి మీద సాము వంటిది . ఆమెకి లోకం లో తిప్పలు , నిందలు తప్పవు సూటి పోటి మాటలు , అవమానాలు భరించలేక ఆ ఉమ్మడి కుటుంబాలలో ఒకరి సంపాదన మీద పడి బ్రతికెందుకు ఆత్మాభిమానం అడ్డు వస్తూ , పరాయి మగవానిని కన్నెత్తి చూసినా రంకు అంటగట్టే ఆ సమాజం లో ఏదో ఒక రోజు ఆత్మహత్య చేసుకునే బదులు భార్తతోనే సహగమనం చేయడం ఉత్తమం. అలా కాకుండా కాస్త పెద్ద వారైన కుమారుల అండ ఉంటే వారి సంరక్షణలో వైధవ్యం స్వీకరించి విధవా ధర్మాలు పాటించడం మరొక మార్గం.

ఇక్కడ పసిబిడ్డలు ఉన్నవారికి , గర్భవతులకు , దూరదేశాన ఉన్నవారికి సహగమనం నిషిద్దం అనేది తెలుస్తుంది . పైపెచ్చు ఆనాడు స్వర్గం నరకం రెండూ ఉన్నాయి అని బలంగా నమ్మే మన సమాజం లో స్వర్గానికి పొదలచిన మంచి నడవడిక కలిగిన స్త్రీలకే ఇవన్నీ వర్తిస్తాయి. అలా కాకుండా ఇష్టారాజ్యం వ్యవహరిస్తూ థూ నా బొడ్డు బాయి అనుకుని తెగించిన వారికి చెప్పడానికి ఏమీలేదు. వారిని ఎవరూ ఏమి చేసేవారు కూడా కాదు. ఆకాలం లో పునర్వివాహాలు లేకపోయినప్పటికీ .. ఒంటరి స్త్రీలు కొందరు జారిణులై మద్యమాంసానికి బానిసలై పతనమైన ఘటనలు ఉన్నాయని చెప్పవచ్చు.

సరే విషయం లోకి వద్దాం ...పరిస్థితులను బట్టి తన స్వరూపాన్ని మార్చుకున్నా భారతీయ సమాజం చాలా గొప్పది. కాకపొతే ప్రతి యుగం లోనూ పర్వర్ట్ లు ఉంటారు. అది భారత దేశం కావచ్చు , పాశ్చాత్య దేశం కావచ్చు ఎదుటి వాడిని బలహీనపరచాలంటే వాడి కుటుంబం లోగానీ వంశం లోగానీ ఆడవారి ద్వారానే పగ తీర్చుకునే అవకాశాలు వీజీగా దొరుకుతుంది అనేది చరిత్ర చెప్పిన సత్యం. ఇంత చదువుకుని ఇంత పరిపక్వత సాధించాం అని చెప్పుకునే ఈ రోజుల్లోనే ఎవడినైనా తిట్టాలంటే నీ అమ్మ , నీ అక్క , నీ ఆలి ఇవి స్టార్టింగ్ పదాలు. ఆ కారణం చేతనే అవతలి వారి కుటుంబాల గురించి మొత్తం తెల్సుకునే ప్రయత్నంలో కొందరు తప్పటడుగులు వేస్తారు . వాటిని హైలైట్ చేయడం కూడా మనలో ఉన్న పర్వర్షన్ బయటపెట్టుకోవడమే . మన సమాజం చందమామ లాంటిది అయితే అందులో చిన్న మచ్చ లాంటి కొందరు చేసే పనులని మొత్తం సమాజానికి ఆపాదించి .... జాతినే ప్రశ్నించే మిడి మిడి జ్ఞానశిఖరాలు ఎక్కువై అసలే దిగజారిన భారతీయ గౌరవాన్ని మరింత దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీరామ చంద్రమూర్తి సీతమ్మని అనుమానించి అగ్నిప్రవేశం చేయించిన ఉదంతానికి సరైన కారణాలు వెదికి , ఆయన లోకకల్యాణం కోసమే చేశాడనిచెప్పిన నోటితోనే మనకి తెల్సిన వారబ్బాయి పెళ్ళికి ముందే అమ్మాయికి సంబంధించి కొన్ని రుజువులు అడిగాడు కాబట్టి వాడు ....ఎదవ .. అలాంటి ఎదవలు ఉన్న భారత దేశం విలువలు లేనిది అని తీర్మానించేస్తాం. రెండు కోట్లకి పైగా యువకులు ఉన్న ఆంధ్ర దేశంలో ఎవడో కౌన్ కిస్కా గొట్టం ఒకడు ( వాడికి తెలిసీ తెలీని వయసులో జరిగిన ఎ సంఘటన వాడి మీద ఎ ప్రభావం చూపిందో) ఏదో తన భార్య శీలవతి అని రుజువు చేసుకోవాలనుకున్నాడు. వాడిని చదువుకుని ఉద్యోగాలు చేసే ఈ తరం అబ్బాయిలకి ప్రతినిధిని చేసేస్తారు కొందరు.
వాడికి కావాల్సింది పెళ్ళాం కాదు మెంటల్ కౌన్సిలింగ్ . వాడి మనసు కి పురుగు పట్టింది. తనలో ఉన్న చెడు కనిపించకుండా వాడు వేసుకున్న ముసుగే సాంప్రదాయం.... బ్లా బ్లా బ్లా .

ఎవడో పర్వర్ట్ ... వాడు కూడ మనిషి కాదు ఒక కధలో పాత్ర ఇండియన్ వాల్యూస్ అంటే అమ్మాయి పెళ్ళికి ముందు శీలవతిగా ఉండడం అన్నాడట. దాన్ని పట్టుకుని కొందరు భారతీయ విలువలని ప్రశ్నిస్తున్నారట.

భారతీయ విలువల గురించి ఒక్క మాట లో చెప్పాలంటే ఒక చిన్న సంఘటన కి సంబంధింఛి చెప్పుకోవచ్చు .

ఒక అబ్బాయి బండి మీద వేగంగా వంకర టింకరగా వెళుతూ ఒక సెంటర్ లో పడ్డాడు అనుకోండి ... మెజారిటీ ప్రజల స్పందన .

ఇండియా లో : చినగా వెళ్ళొచ్చు కదయ్య లేదా అంత తొందరేంటి బాబు లేదా ఏరా సామీ ఇంట్లో చెప్పి వచ్చావా

అమెరికాలో : Asshole or Mother **** er

పాకిస్తాన్ : क्यारे देखके नहीं चलते माके लाव्दे

ఈ తేడా చాలు మన సమాజం విలువ చెప్పడానికి.

చివరిగా ఒక స్కూల్ లో పది మంది చదువుకున్నారు . అందులో ఐదుగురు మంచి స్థాయి వచ్చి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్కుంటూ తమ ఉన్నతికి కారణం ఆ స్కూల్ అని చెప్పుకున్నారు . మరో ఐదుగురు పతనమై పోయి తమ పతనానికి కారణం అదే స్కూల్ అని చెప్పారు యేది నిజం.

తేడా స్కూల్ లో లేదు మనలో ఉంది. అలాగే భారతీయ సమాజం మంచిదే కానీ చూసే దృష్టిని బట్టి అది కనిపిస్తుంది.

( నాదీ మిడి మిడి జ్ఞానమే - తప్పులుంటే సరిచేయగలరు)

5/6/10

సిగ్గు సిగ్గు - నరరూప రాక్షసులు తప్పించుకునే అవకాశం


గత జనవరి 30 న చిన్నారి నాగ వైష్ణవిని విజయవాడలో కిడ్నాప్ చేసి అత్యంత కిరాతకంగా హత్య చేసిన మోర్ల శ్రీనివాస రావు , జగదీశ్, పంది వెంకట్రావ్ గౌడ్ లకు శిక్ష నుండి తప్పించుకునే అవకాశాలు వరుసగా వస్తున్నాయి. నిందితులను సరిగ్గా ఇంటరాగేట్ చేయకుండా పోలీసులు వారికి సహకరిస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్న నేపధ్యం లో ఈ రోజు ఫోరెన్సిక్ ల్యాబ్ వైష్ణవి కి సంబందించిన బూడిద నుండి డియెన్ఏ సేకరించడం కష్టం అని తేల్చి చెప్పడంతో వైష్ణవి హత్యని నిరూపించే అవకాశం లేకుండా పోయింది. సంఘటనా స్థలం లో బూడిద కుప్పలా దొరికిన వైష్ణవి కి చెందిన ఎముకలను క్షుణ్ణంగా పరిశీలించిన ఫోరెన్సిక్ ల్యాబ్ కి అందులో ఏ ఆధారాలు దొరకలేదట. డి యెన్ ఏ సేకరించలేకపోయాం అంటూ చేతులు ఎత్తేసింది. ఒక పక్క నిందితులు కోర్టులో ఒప్పుకునే పరిస్థితి లేదు. మరో పక్క నిన్ననే నిందితులకు నార్కో అనాలసిస్ పరీక్షలు చేయవద్దని సుప్రీం ఆదేశించడం ఈ కేసుకి అడ్డంకి గా మారింది. వైష్ణవి తండ్రి మరణించాడు .. హంతకులను చూసిన డ్రైవర్ మరణించాడు, నిందితులు నిజం ఒపుకోవడం లేదు, నార్కో టెస్ట్ చేయకూడదు , చివరిగా మిగిలిన ఆధారం వైష్ణవి కి చెందిన అవశేషాలు ..... వాటి నుండి కూడా ఆధారాలు దొరకడం లేదు .. ఇక నిందితులు బయటికి రావడానికి మార్గం సుగమనం అయింది.


మనం ఏమీ చేయలేం -కనీసం కాసేపు సిగ్గు పడదాం................ చిన్నారి వైషు కి సారీ చెబుదాం. సారీ వైష్ణవి .. నీకే న్యాయం చేయలేక పోయాం కనీసం నీ ఆత్మకి శాంతి కలిగించలేకపోయాం.

5/5/10

ఆ పాట భయంకరం

ప్రపంచం లోనే అతి భయంకర డాన్స్





మరో సూపర్ స్టార్





అది చూసి మతి చెడిన స్టార్





కొసమెరుపు

5/4/10

ఒక సారి "కేక " పెట్టి చూడండి

సాధారణంగా మనకి తెల్సిన( నచ్చిన) ఒక విషయాన్ని నలుగురితో పంచుకోవాలి అనిపిస్తుంది. అందుకే ఈమెయిలు ఫార్వర్డ్ చేయడం ద్వారా మన మిత్రులకు చెబుతూ ఉంటాం . ఆ విషయం చెప్పింది మనమే అని అందరికీ తెలియాలంటే అందుకు అనువైన వేదిక బ్లాగు. మనకి బ్లాగు రాయడం అలవాటు అయిన తర్వాత మనకి తెల్సిన ప్రతి విషయాన్ని బ్లాగులో రాయాలి నలుగురితో పంచుకోవాలి అనిపిస్తుంది . ఇది సహజం నేను అయితే నాకొచ్చిన కల కూడా వ్రాసాను. అయితే ప్రతి చిన్న విషయాన్ని మనం బ్లాగులో రాయలేం . ఈ క్షణం ఏం చేస్తున్నాం అనేది సరదాగా వ్రాయాలంటే దానికి బ్లాగు కన్నా సరైన వేదిక మైక్రో బ్లాగింగ్. ట్విట్టర్ వాడే వారికి చెప్పనవసరం లేదు కానీ చిన్న చిన్న లైన్లు ఒకటి రెండు పదాలు బ్లాగడానికి అనువైన వేదిక మైక్రో బ్లాగింగ్ కాన్సెప్ట్. ఇప్పటికిప్పుడు మీరేం చేస్తున్నారు అనే విషయాలతో బాటు మీ మిత్రులతో సరదాగా చర్చించడానికి కూడా ఇందులో అవకాశం ఉంటుంది . వీటి కోసమే ఏర్పాటు చేయబడింది కేక .

సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ అయిన ఆర్కుట్ , ఫేస్ బుక్ లకంటే భిన్నమైనది కేక . కేకలో అంతా బహిరంగమే . కేక లో మీరు మీ అప్ డేట్స్ పోస్ట్ చేయవచ్చు , వేరొకరి అప్ డేట్స్ చదవచ్చు. కేక అలవాటైనాక చాలా చక్కగా మీరు ఎంజాయ్ చేస్తారు . బ్లాగింగ్ కి సరి కొత్త రూపమైన కేక లో ఒకకేక పెట్టి చూడండి .... ఇంక కేక లు పెడుతూనే ఉంటారు.

5/2/10

ఏమిటీ వివక్ష

ఒక సారి ఈ కింది వీడియో చూడండి



ఇప్పుడు ఇది చూడండి


ఇంగ్లీషు వాడు చస్తే నోరు తెరుచుకుని చూసేవాళ్ళు బాలయ్య చేస్తే ఎక్కిరిస్తారెందుకు . తెలుగు హీరోలకి సూపర్ నాచురల్ పవర్స్ ఉండకూడదా .

5/1/10

అసలు రావాల్సిన మార్పేంటి- కొందరు కోరుతున్నదేంటి

ఈ టపా ఎవరినో దెప్పి పొడవడానికి కాదు . నిత్యం మన చుట్టూ జరిగే విషయాల్లో మన సంకుచిత్వాన్ని ప్రశ్నించుకునే ప్రయత్నం. చదువుకున్న పరిస్థితుల వల్ల అయితే నేమి , స్నేహాల వల్ల అయితేనేమి మనలో చాలా మంది వ్యవస్థలో బలమైన మార్పులు కోరుతున్నాం. కాని మూలాల్లో నుండి మన మనస్తత్వాల లో మార్పు తెచ్చుకుంటే తప్ప అంత తేలిగ్గా పెద్ద పెద్ద విషయాల్లో లో మార్పులు కష్టం అనేది నా భావన.

ఉదాహరణకి ఒక రిక్షా కార్మికుడు సెల్ లో మాట్లాడుతుంటే " చూడు సెల్ ఫోన్లు ఎంత చీప్ అయిపోయాయో , ఆఖరికి రిక్షా వాడు కూడా సెల్ లో మాట్లాడుతున్నాడు అని సెటైర్లు చాలా మంది వేసే ఉంటారు లేక పోతే మన పక్కన వాళ్ళు వేయగా వినే ఉంటారు .. ఏం రిక్షా వాడు సెల్ లో మాట్లడకూడదా................ అతనికి చుట్టాలు ఉండరా లేక అతనికి సెల్ ఫోన్ లాంటి ఉపకరణాలు నిషిద్ధమా ?? ఆర్ధిక పరమైన అంశాల మూలంగా మనుషులను అంచనా వేసే దౌర్భాగ్య మనస్తత్వాల్లో మార్పు రావాలి .

ఇక ఇప్పుడు రాయబోయే పాయింట్ మన మార్తాండ కి బాగా పరిచయం ఉండవచ్చు . ఇంటర్నెట్ కేఫ్ కి వెళ్లి పెన్ డ్రైవ్ నుండి ఒక రెండు ప్రింట్ ఔట్స్ తీసుకుంటుంటే ఆ కేఫ్ ఓనరు రెండు రూపాయలు అడిగి తీసుకుంటాడు ... మరీ రెండు రూపాయలకి ఇతనికి ఎం వస్తుంది అనుకునే లోపే మరొకతను వచ్చి మరో ప్రింట్ ఔట్ తీసుకున్నాడు . ఓనర్ ఒక రూపాయి అనగానే మొహం చిట్లించి ఎందుకు అర్ధ రూపాయి ఏ కదా అన్నాడు అదోలా ........ ఆ వ్యక్తి వంక తేరిపార చూశా చాలా ఖరీదైన బట్టలే వేసుకున్నాడు మరెందుకు ఇంత కక్కుర్తి ???? " ఇలాంటి వాళ్ళు రోజుకి పది మంది వస్తారు సార్ " అన్నాడతను ? అర్ధ రూపాయి కోసం ఇంత కక్కుర్తా?

చాలా కష్టపడి పైకొచ్చిన ఇంకొక ఫ్రెండ్ చెబుతూ ఉండేవాడు అతను బాగా స్ట్రగుల్ అవుతున్న రోజుల్లో ఫ్రెండ్స్ దగ్గరకెళ్ళి భోజనం పెట్టించమని అడిగితే గేలి చేసేవారట...... రెండు మూడు గంటల పాటు వెయిట్ చేయించిన తర్వాత ఇక్కడే కూర్చో ఇప్పుడే వస్తాం అని వెళ్ళిపోయి ఇంక కనిపించే వారు కాదట ... అదే సిగిరెట్ అడిగినా మందు పార్టీ ఇవ్వమన్నా వెంటనే బయలుదేరేవారట .... ఆ రోజుల్లో 15 పెట్టి భోజనం పెట్టలేదు గానీ ... వంద రూపాయలు పెట్టి మందు మాత్రం పోయిస్తారు ఎం మనస్తత్వాలో ఏంటో అంటూ ఉంటాడు.

కస్టపడి బట్టలు చించుకుని బాలయ్య సినిమా టిక్కట్ 200 పెట్టి కొంటాం గానీ అక్కడే రోడ్డు పక్కన చెట్టుకింద కాలు చాపుకున్న ముసలవ్వ కి ఒక్క రూపాయి కూడా ధర్మం చేయాలనే ఆలోచన రాని మెంటాలిటీ ప్రతి జనరేషన్ కి పెరుగుతుంది. ఉచితార్ధంగా ఆధిపత్యం కోసం పోరాటం. ఏదైనా ఈవెంట్ కోసం కష్టపడేప్పుడు ఒక్కడు రాడు. అదే దానికి పేరు వస్తే ఆ సక్సెస్ తన ఖాతాలో వేసుకోవడానికి ..... ఎక్కడ లేని ప్రయత్నాలు చేయడం. చదవకుండా పాసైపోదామనుకునే పిల్లల లో వచ్చిన మార్పు మొగ్గ దశలోనే మాడిపోవాలి.

ఇలా కాదు మార్పు రావాలి ......... వృత్తుల మీద గౌరవం పెరగాలి , సినిమా రిలీజ్ రోజు ఎండకి ఎండి వానకి తడిసి హీరోకి కటౌట్ పెట్టే కురాళ్ళు కనిపించకూడదు. అసలు సినిమా టిక్కట్లు బ్లాక్ లో కొనే దౌర్భాగ్యం ఉండకూడదు. బస్సుల్లో స్త్రీల సీట్లలో కూర్చోవడం మానాలి ఇంకా ఎన్నో ఉన్నాయి . నేను చెప్పింది కొన్ని ఉదాహరణలే
ఇవన్నీ సిల్లీగా అనిపిస్తాయి గానీ ముందు ఇలాంటి బుద్ధులు మారితే కదా తర్వాత మనం అనుకునే పెద్ద పెద్ద విషయాలలో మార్పు కోరుకునేంత విశాల పరిపక్వత చెందిన ఆలోచనలు వచ్చేది . రూట్ లెవల్లోనే మనం చాలా వెనక బడి ఉన్నాం ఇంకా ఇది దాటి ... సహజీవనాలు , పెళ్ళికి ముందే కిల్లీలు , కొన్ని విషయాలకి చట్టబద్ధతలు అంగీకరించే కనీసం ఆలోచించేదశకు సమాజం చేరుకోవాలంటే చాలా కష్టం . ఏమంటారు ????

ఇవన్నీ వదిలేసి పనికి మాలిన విషయాల్లో మార్పు కోరుకుంటుంటే సమాజం సంకనాకి పోద్ది

4/30/10

సమానత్వం పేరుతో ఎటు వెళ్తున్నాం మనం ????

లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అంటూ అన్న ఎన్టీవోడు పాడుతూ ఉంటే........ పాపం అంతకు ముందు వీళ్ళు కూర్చుని ఉండేవారు కాబోలు అనుకునే వాడిని చిన్నతనం లో. అయితే స్త్రీలు పురుషులతో సమానం అని చెప్పి అన్ని రంగాలలో ముందంజ వేయడం చివరికి అంతరిక్షానికి సైతం వెళ్లి రావడం స్త్రీ జాతికి గర్వ కారణం. అయితే ప్రతి మనిషికి తన జీవిత లక్ష్యానికి ప్రయాణం ప్రారంభించినప్పుడు కళ్ళ ముందు రెండు దారులు ఉంటాయి . వాటిలో ఒకటి ఒకటి అభివృద్ధి పధం లో మంచి అలవాట్లతో తను అనుకుంది సాధించి నలుగురి మన్నన పొందడం , నలుగురికి ఉపయోగపడే పనులు చేయడం వగైరా వగైరా . మరి రెండవది .. సప్తవ్యసనాలకు బానిస అవడం , జులాయిగా తిరగడం , జీవితం లో ఒక లక్ష్యం , ఒక ఆశయం అంటూ లేకుండా కేవలం సెక్స్ , మద్యం రౌడీఇజం మొదలైన పతనానికి హేతువుల బారిన ( దుర్గేశ్వర గారి భాషలో కలి ప్రభావానికి లోనయి) పడి... సుఖరోగాలతో , అందరి చేత చీ కొట్టించుకుంటూ రక్తకన్నీరు నాగభూషణం టైపు లోకి వెళ్లడం.

మొదటి దశలో సమానత్వం వైపు స్త్రీలు ఎప్పుడో ఎప్పుడో అడుగులు వేశారు . దేశ ప్రధానులు అయ్యారు , నోబుల్ గ్రహీతలు అయ్యారు ఇంకా మరెన్నో సాధించారు . ఆడవారికే కాక మగవారికి సైతం ఆదర్శప్రాయులయ్యారు . మానవతా వాదులకు ఆనందం కలిగించే విషయం ఇది.

అయితే వచ్చిన చిక్కల్లా........... మనిషి పతనమయ్యే రెండో మార్గం లో ఇంతవరకు మగాళ్ళ దే పై చేయి ..... మద్యపానం వల్ల ధూమపానం వల్ల వారు పతనం అవడమే కాక భావితరాలకి కూడా అనారోగ్య లక్షణాలు అందిస్తున్నారు కొందరు ... ఇటువంటి పరిస్థితిలో స్త్రీలు సైతం మద్యపానం , దూమపానం మొదలెట్టి ఈ దరిద్రాన్ని మరింత పెంచారు. పైగా సమానత్వం పేరుతో విచ్చలవిడి వ్యవాహారాలకి కూడా మహిళలకి కూడా అవకాశాలు ఉండాలి అని వాదించే వాదనల వల్ల కొత్త చిక్కులు వచ్చే ప్రమాదం ఉంది.

మనం ఈ విషయాన్ని గురించి మాట్లాడుకోవడానికి భయపడి మనకెందుకు వచ్చిన రచ్చ అనుకుంటాం గానీ మాట్లాడి తీరాలండీ .......... ఆడాళ్ళకి వ్యభిచారం చేసే హక్కులు ఎంటండి నా బొంద. ఆడాళ్ళకి కూడా వ్యభిచారం చేసే హక్కు కల్పిస్తూ వ్యభిచారం చట్టబద్దం చేయాలట . ఇదెక్కడి గొడవ సుఖ రోగాలు కొని తెచ్చుకోవడానికి హక్కా????? ఇప్పటికే మాములుగా దొరికిన అమ్మాయి బతకడమే కష్టం.... ఇక విటురాలి ( కొత్త పదం) హోదాలో వెళ్ళిన అమ్మాయి బ్రతికిరావడమే ??? ఏంటో స్త్రీ పురుషుల సమాన హక్కులు కోసం మాట్లాడే వాళ్ళు ఇలాంటి విషయాల మీద కాన్సంట్రేట్ చేయడం ........ స్త్రీలు విచ్చలవిడి శృంగారం కోరుకుంటున్నారు అనే భావన జనాల్లో పాతుకు పోవడానికి దోహదపడుతుంది.

మనం ముందు అనుకున్నట్టు మనషి ఎంచుకోవాల్సిన మొదటి మార్గం లో స్త్రీ పురుషులు పోటీపడి భావితరాలకి ఆదర్శప్రాయులు అవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైన ఉంది . అంతే గాని మద్యపాన , వ్యభిచార వ్యవహారాలతో పురుషులతో పోటీ పడే అవకాశాలు కావాలి అని కొందరు దాంభికాలు పలికితే ప్రస్తుతం ఇప్పుడిప్పుడే బ్లాగులు, పత్రికలూ చదవడానికి ఉద్యుక్తులవతున్న పసి మనస్సులో చెడు బీజాలు పడే ప్రమాదం ఉంది.

కనుక మాట్లాడండి ........... సరైన సమానత్వాన్ని చాటండి

4/29/10

ఈ రోజు ఏంటో మీకు తెల్సా?

సూటిగా సుత్తిలేకుండా చెబుతా ............... ఈ రోజు శ్రీకాకుళం అన్నాయి మార్తాండ పుట్టిన రోజు ..... అందరూ శుభాకాంక్షలు తెలపండి ....................చాక్లెట్లు కావాలంటే శ్రీకాకుళం వెళ్ళండి.

జన్మదిన శుభాకాంక్షలు ప్రవీణు, ముందు ముందు మంచి మంచి కధలు కవితలు రాసి బ్లాగర్లని అలరించాలని కోరుకుంటుండా......

4/28/10

వ్యభిచారం - చట్టబద్ధం - పరిణామాలు

మద్యం, జూదం , వ్యభిచారం .. మనిషి చాలా త్వరగా ఆకర్షించబడి చివరికి పతనమయ్యే కొన్ని అలవాట్లలో ఇవి ప్రధానమైనవి. నాకు చరిత్రలు తెలియావ్ గానీ నా చిన్న తనంలో ఎవరైనా మద్యం సేవించే వారిని ఒక విలన్ లాగా చూసే వారు మా ఏరియా లో..... మరి ఇప్పుడో ఇంటికి ఇద్దరు తాగుబోతులు ఉన్నారు ( ఎవరి మనోభావాలు అయినా గాయపడితే క్షంతవ్యుడిని) మహిళలలో సైతం మద్యం సేవిస్తున్నారు . గుట్టు చప్పుడు కాకుండా రెండు పెగ్గులు తాగి నక్కి నక్కి గుంటనక్కలా ఇంటికి పోయేవాడు ఒకడైతే మూడో పెగ్గు దాటి పులి లాగా వాడెంత , వాడెంత వీడెంత అని అరచి నానా రచ్చ చేసేవాడు ఇంకొకడు. ఈ రెండు స్టేజీలు దాటిన తర్వాత ఇంకొక స్టేజి ఉంటది..... అదే పంది దశ అంటారు ... అంటే యెంత తాగారో తెలీనంత తాగి రోడ్డు పక్కన కాలువలలో పంది లాగ పొరలె స్టేజి. గ్రామ గ్రామాన వెలసిన బెల్టు షాపులు , వీది వీధిన తాగి తిరిగే మందుబాబులు ఎక్కువ అయ్యారు ఎందుకు మన దగ్గర మద్యపానం చట్టబద్ధం అవడం వల్ల . కేవల ప్రబుత్వం తాగమంది ఆ ఒక్క మాట చాలు మిగతా నిభందనలు తుంగలో తోక్కేయోచ్చు .. ఎక్సైజు శాఖ వారికీ మామూలు ఇస్తే చాలు. మధ్యపాన నిషేధం ఉన్న రోజుల్లో రోడ్డు మీద తాగి తిరిగిన దాఖలాలు బాగా తగ్గాయి . ఎప్పుడైతే నిషేధం ఎత్త్ఘేశారో అడ్డు అదుపు లేకుండా పోయింది. ఎందుకంటే మన మనస్తత్వాలు అలాంటివి కనుక. ఇక పోతే జూదం విషయానికి వస్తే ప్రస్తుతం ఎక్కడైనా పేకాట ఆడుతున్నారు అనే సమాచారం వచ్చి పోలీసులు రైడ్ చేస్తే ఎటు వాళ్ళు అటు పరిగెత్తి పంచెలు ఎగ్గట్టి గోడలు దూకి పారిపొయి , ఎందుకొచ్చిన గొడవరా నాయనా నానా హైరానా పడి చివరకి పేకాట మానేశారు కొన్ని గ్రామాల్లో. ఉదాహరణ ప్రకాశం జిల్లా చెరువు కొమ్ము పాలెం, త్రోవగుంట, దశరాజుపల్లి వగైరా వగైరా . పోలీసులు వచ్చి కొడుతుంటే చాల చిన్న తనంగా ఉంది శీను అందుకే మద్యాహ్నం పేకాట మానేసి పని చేసుకుంటున్నా చాలా డబ్బులు సంపాదించా అని మా రెగ్యులర్ బార్బర్ కొండలు ఈ మద్య చెబుతున్నాడు. అన్ని ఏరియాలలో ఇది వర్క్ ఔట్ అవక పోయినా కాస్తంత ఉపశమనం కలిగించే విషయం.

ఇక అలాగే వ్యభిచారం విషయానికి వస్తే ప్రస్తుతం రెడ్ లైట్ ఎరియాలలో వేశ్యా గృహలకి నక్కి నక్కి పోతున్నారు చాలా మంది వరకు ... వచ్చిన చిక్కంతా హైటెక్ వ్యభిచారం వచ్చిన తర్వాతే .. నివాస గృహాల మద్య ఖరీదైన మనుషుల్లా తిరుగుతూ గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం చేయడం వారికి రాజకీయ నాయకుల అండదండలు ఉండడం వల్ల వ్యభిచారం అనేది ఊరి బయట నుండి ఊరి మధ్యకి ఎప్పుడో వచ్చేసింది. కాకపొతే టీవీ కెమేరాలకి పరువుకి కొండొకచో పెళ్లాల భయానికి కొందరు మానేసిన మాట వాస్తవం. అయితే చట్టబద్ధం చేయడం వలన చాలామందికి రెక్కలు వస్తాయి . ఎలా అయితే మద్యం వ్యాపారి ఈనాడు అత్యున్నత దేవాలయ పదవి అలంకరించాడో .... చట్టబద్దం అయిన తర్వాత చట్టబద్ధమైన వ్యభిచార గృహాలు మన నేతలు నడపడం మొదలెట్టి రాష్ట్రం లో అత్యధిక ఆదాయం గల వ్యభిచార గృహ నిర్వహాహక నేత ఏదో ఒక పవిత్రమైన పదవి అధిస్టించే ప్రమాదం లేకపోలేదు. ఒకప్పుడు ఒంగోలు పట్టణం లో రామ్ నగర్ రైల్వే ట్రాక్ ప్రాంతం రెడ్ లైట్ ఏరియా గా బాగా ప్రాచుర్యం లో ఉంది. అయితే పోలీసులు దాడులు చేసి పట్టుకుని కోర్టులో వారు 25 ర్తూపాయలు ఫైన్ కట్టి మళ్లీ అదే పని చేయడం ఇలా జరుగుతూ ఉండేది . చివరికి ఒక బ్రహ్మాండమైన ఐడియాతో పోలీసులు వారి ఆట కట్టించారు. ఆ గృహాలు వెళ్ళే దారులన్నీటి లోనూ మఫ్టీ లో ఉన్న పోలీసులు దాగి అక్కడికి వెళ్లి వచ్చే ప్రతి ఒక్కడిని పట్టుకుని స్టేషన్ లో పెట్టడం మొదలెట్టారు. దీంతో అటు వెళితే పోలీసులకు పట్టు బడడం ఖాయం అనే భయంతో కొన్నాళ్ళ తర్వాతా ఆ రెడ్ లైట్ ఏరియాకి ఎవరూ వెళ్లకపోగా నిర్వాహకులు సైతం వేరే వ్యాపారాలో నిమగ్నమై అ వృత్తి మానేశారు . అయితే ఇదంతా జరగడానికి పదేళ్ళకి పైగా పట్టింది. ప్రస్తుతం వ్యభిచారం చేస్తే పోలీసులో , టీవీ వాల్లో పట్టుకుంటే పరువుపోతుంది అనే భయం వల్ల జనాల్లో చాలా మంది వ్యభిచారం జోలికి పోవడం లేదు. అదే చట్టబద్దం చేస్తే భయపడే వాడేవడు. అంతంతమాత్రంగా ఉన్న కాపురాలు సైతం కల్లోలం అవుతాయి. ప్రస్తుతం యువతకి సహనం తగ్గింది. ప్రతి చిన్న గొడవ చిలికి చిలికి గాలివాన అవుతుంది. ముఖ్యంగా భార్య భర్తల మద్య . సరిగ్గా అదే సమయం లో " వంటకని వైఫెందుకురా హోటళ్ళు చాలు , వంటికని ఒకటా రెండా అంగడి అందాలు " అనే లైన్లతో వినడానికి చక్కగా ఉండే పాటలు ఉత్సాహపరుస్తుంటే , శనగలు తిని చెయ్యి కడుక్కునే వారు ఎక్కువ అవుతారు. ప్రస్తుతం వ్యభిచార గృహం గుట్టు చప్పుడు కాకుండా నిర్వహించే బడా బడా నేతలు ఈ వ్యాపారం లోడైరక్టు దిగుతారు. ట్రాఫికింగ్ అప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది . వ్యాపార అభివృద్ధికి అందంగా ఉండే అమ్మాయిల కిడ్నాప్ లు ఎక్కువ అవుతాయి. వాళ్ళని మాదక ద్రవ్యాలకి బానిసల్ని చేసి వారితో వ్యాపారం చేస్తారు. నిబంధనలు అన్నీ తుంగలో తొక్కుతారు. ఆ ఊహే భయంకరంగా ఉంటుంది . ఇప్పుడు గ్రామాల్లో తిరునాళ్ళలో నగ్న నృత్యాలు చేస్తున్నారు అదీ పోలీసుల భయంతో కొన్ని చోట్ల మానేశారు . ముందు ముందు వ్యభిచారం చట్టబద్ధం అయితే ఇవన్నీ శృతి మించుతాయి. అశ్లీల నృత్యాలు చేసేటపుడు పోలీసులు వస్తే ఇక్కడ జరిగేది నృత్యాలు కాదు వ్యభిచారం చేస్తున్నాం అని చెబుతారు. పోలీసులు ఏమి చేయగలరు . ఒక కామెడీ ఉదాహరణ : పలాన గ్రామంలో వ్యభిచారం చేయడానికి డి.ఎస్.పి కి పర్మిషన్ లెటర్ పెడితే ఎంత చండాలంగా ఉంటుంది .

నోట్ : దేశం లో రేపుల సంఖ్య తగ్గించడానికి వ్యభిచారం చట్టబద్దం చేయడం ... ఎలుకలున్నాయని ఇళ్ళు తగలబెట్టడంతో సమానం అని నా అభిప్రాయం. మరి మీరేమంటారు .