అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

5/10/10

భారతీయ సమాజం - నాకు తెల్సిన విషయం

స్త్రీ పురుషుల మద్య స్నేహాన్నిసరిగా అర్ధం చేసుకోలేని పరిస్థితి గురించి చర్చ జరిగినప్పుడు కొన్ని విషయాలు గురించి తీవ్రంగా ఆలోచించడం జరిగింది. స్త్రీకి ఆర్ధిక స్వాతంత్రం లభిస్తున్న నేటి రోజుల్లో ఎవరేమి అనుకుంటే నాకేమి నా మనసు నాకు తెల్సు అని ధైర్యంగా ముందుకు పోగలిగిన పరిస్థితులు నేడు ఉత్పన్నం అయ్యాయి . దీనికి ఆర్ధిక స్వాతంత్రం ఒక కారణం అయితే అర్ధం చేస్కునే కుటుంబసభ్యులు మరొక కారణం గా మనం చెప్పుకోవచ్చు. కానీ ఆనాటి కాలం లో స్త్రీకి ఎ ఆర్ధిక ఆసరా గానీ , కుటుంబం నుండి అండదండలు గానీ అంతగా లభించనప్పుడు ఆమె పరిస్థితి ఏమిటి ??? అప్పట్లో మన వాళ్లకి కుటుంబ నియంత్రణ లేక పోవడం గంపలు గంపలు గా పిల్లలని కని పడేయడం వారిని పెంచలేక సతమతమవడం మొదలైన కారణాలు పీడిస్తున్నప్పుడే ... కొందరు ధనవంతులైన వృద్ధులు కన్నె పిల్లలను పెళ్లి చేసుకోవడం మొదలెట్టారు . అలాగే యుక్తవయస్సులో ఉన్న వారు కూడా వివాహం తగిన ఈడు జోడు ఉన్న వారు కూడా పెళ్లి చేసుకునే వారు . మొదటి కేసు లో వృద్ధుడైన భర్త మరణించినా అమ్మాయి చిన్న వయస్సులో విధవరాలయ్యేది. లేదా రెండవ కేసు విషయానికి వచ్చేసరికి ఆనాడు తగిన వైద్య సౌకర్యాలు లేక విషజ్వరాలు వంటివి సోకి మరణించడం వంటివి సంభవించేవి. ఔనన్నా కాదన్నా మనది అనాదిగా పితృస్వామ్య వ్యవస్థ . అమ్మాయి మరణిస్తే అబ్బాయి మరొక వివాహం చేసుకునే వాడు కానీ అబ్బాయి మరణిస్తే ఆమెను మరొకరు వివాహం ఆడేవారు కాదు . ఇక ఆమెకి అన్నీ కష్టాలే .

సరిగ్గా అటువంటి పరిస్థితే వచ్చినప్పుడు జరిగిన సంఘటన ఇపుడు మనం చదువుదాం . దత్తాత్రేయుడు అనే యువకునికి , సావిత్రి అని యువతికి ఘనం గా వివాహం జరిపించారు వారి తల్లి దండ్రులు. చాలా చక్కని సంసారం వారిది . అయితే కొన్నాళ్ళకి అ యువకునికి జబ్బు చేసి ఎన్ని మందులు వాడినా తగ్గగా పోగా నానాటికీ క్షీణించసాగాడు. చివరి ప్రయత్నగా గంధర్వపురం లో ఉండే శ్రీ నరసింహ సరస్వతీ వద్దకు తీసుకొస్తుండగా మార్గ మద్యలో ఆ యువకుడు మరణిస్తాడు. ఊరు కాని ఊరు లో భర్త శవం పై పడి ఆమె ఎడుస్తుండగా ఒక ముని వచ్చి ఆమెకు కొన్ని మంచి మాటలు చెప్పి స్వాంతన చేకూరుస్తాడు. అప్పుడు ఆమె తనకు మార్గం సూచించమని అడుగగా ఆమెకు బృహస్పతి వుపదేశించిన స్త్రీ ధర్మాలు చెబుతాడు. భర్త చనిపోయిన యావజ్జీవమూ విధవా ధర్మం పాటించడం ఉత్తమం (అప్పట్లో రెండో వివాహం ప్రసక్తి లేదు) ఇవన్నీ భర్త లేక తను బ్రతుకలేను అనుకునే వారికే . ఆ విధవా ధర్మాలు చాలా ఉత్తమం అయినవి. ఆమె తప్పని సరిగా జుట్టు తీయించుకోవాలి . లేదంటే జుట్టు అనే త్రాడుతో భర్త ను కట్టివేసినదోషం వస్తుంది . అమెతోబాటు మరణించిన ఆమె భర్త సైతం ఆ పాపాన్ని మోయవలసి వస్తుంది. నిత్యం తలస్నానం చేసి ఒంటి పూట భోజనం చేస్తూ ఉండాలి. వయసు మేడ పడిన వారు రెండవ పూట పాలు, ఫలములు భుజించవచ్చును. నేల మీదనే పడుకోవాలి. తెల్ల చీరలు ధరించాలి .. సుఘంధములు ,పూలు ధరించరాదు. వేసవికాలంలో నీరు దొరకని ప్రాంతాల్లో చలివేంద్రం పెట్టించాలి. వైశాఖమాసం లో జల దానం , కార్తీక మాసం లో దీప దానం , మాఘం లో నెయ్యి నువ్వులు దానం చేయడం శ్రేష్టం .. ఇలాంటి ధర్మాలు ఆచరిస్తే ఆమె స్వర్గానికి పోవడమే కాక మరణించిన ఆమె భర్త ఆత్మ సైతం శాంతిస్తుంది. ఇలా చేయలేని పక్షం లో పతివ్రతయైన స్త్రీ , తన భర్తను విడిచి బ్రతుకలేను అని భావించే స్త్రీ స్వర్గమునకు పోవలేనంటే సతీసహగమనం చేయడం ఉత్తమం అని చెబుతాడు. ఆమె గర్భవతి అయినా , లేక పసి బిడ్డలు ఉన్నా లేదా ఆమె దూర ప్రాంతమున ఉన్నా ఇటు వంటివి చేయకూడదు అని చెబుతాడు. దానికి సిద్ధపడి సహగమనం చేయదలచిన సావిత్రి భక్తికి మెచ్చి ఆమెని వారించి ఆమె భర్తను బ్రతికించాడు అన్నది కధ.

పై వాఖ్యాల సారాంశం........ భర్త లేని స్త్రీ ని ప్రస్తుత సమాజం ఎంత ఇబ్బంది పెడుతుందో మనకి తెల్సు . ఆ రోజుల్లో యవ్వనవతి , సౌందర్యవతి అయిన స్త్రీ కి వైధవ్యం కత్తి మీద సాము వంటిది . ఆమెకి లోకం లో తిప్పలు , నిందలు తప్పవు సూటి పోటి మాటలు , అవమానాలు భరించలేక ఆ ఉమ్మడి కుటుంబాలలో ఒకరి సంపాదన మీద పడి బ్రతికెందుకు ఆత్మాభిమానం అడ్డు వస్తూ , పరాయి మగవానిని కన్నెత్తి చూసినా రంకు అంటగట్టే ఆ సమాజం లో ఏదో ఒక రోజు ఆత్మహత్య చేసుకునే బదులు భార్తతోనే సహగమనం చేయడం ఉత్తమం. అలా కాకుండా కాస్త పెద్ద వారైన కుమారుల అండ ఉంటే వారి సంరక్షణలో వైధవ్యం స్వీకరించి విధవా ధర్మాలు పాటించడం మరొక మార్గం.

ఇక్కడ పసిబిడ్డలు ఉన్నవారికి , గర్భవతులకు , దూరదేశాన ఉన్నవారికి సహగమనం నిషిద్దం అనేది తెలుస్తుంది . పైపెచ్చు ఆనాడు స్వర్గం నరకం రెండూ ఉన్నాయి అని బలంగా నమ్మే మన సమాజం లో స్వర్గానికి పొదలచిన మంచి నడవడిక కలిగిన స్త్రీలకే ఇవన్నీ వర్తిస్తాయి. అలా కాకుండా ఇష్టారాజ్యం వ్యవహరిస్తూ థూ నా బొడ్డు బాయి అనుకుని తెగించిన వారికి చెప్పడానికి ఏమీలేదు. వారిని ఎవరూ ఏమి చేసేవారు కూడా కాదు. ఆకాలం లో పునర్వివాహాలు లేకపోయినప్పటికీ .. ఒంటరి స్త్రీలు కొందరు జారిణులై మద్యమాంసానికి బానిసలై పతనమైన ఘటనలు ఉన్నాయని చెప్పవచ్చు.

సరే విషయం లోకి వద్దాం ...పరిస్థితులను బట్టి తన స్వరూపాన్ని మార్చుకున్నా భారతీయ సమాజం చాలా గొప్పది. కాకపొతే ప్రతి యుగం లోనూ పర్వర్ట్ లు ఉంటారు. అది భారత దేశం కావచ్చు , పాశ్చాత్య దేశం కావచ్చు ఎదుటి వాడిని బలహీనపరచాలంటే వాడి కుటుంబం లోగానీ వంశం లోగానీ ఆడవారి ద్వారానే పగ తీర్చుకునే అవకాశాలు వీజీగా దొరుకుతుంది అనేది చరిత్ర చెప్పిన సత్యం. ఇంత చదువుకుని ఇంత పరిపక్వత సాధించాం అని చెప్పుకునే ఈ రోజుల్లోనే ఎవడినైనా తిట్టాలంటే నీ అమ్మ , నీ అక్క , నీ ఆలి ఇవి స్టార్టింగ్ పదాలు. ఆ కారణం చేతనే అవతలి వారి కుటుంబాల గురించి మొత్తం తెల్సుకునే ప్రయత్నంలో కొందరు తప్పటడుగులు వేస్తారు . వాటిని హైలైట్ చేయడం కూడా మనలో ఉన్న పర్వర్షన్ బయటపెట్టుకోవడమే . మన సమాజం చందమామ లాంటిది అయితే అందులో చిన్న మచ్చ లాంటి కొందరు చేసే పనులని మొత్తం సమాజానికి ఆపాదించి .... జాతినే ప్రశ్నించే మిడి మిడి జ్ఞానశిఖరాలు ఎక్కువై అసలే దిగజారిన భారతీయ గౌరవాన్ని మరింత దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీరామ చంద్రమూర్తి సీతమ్మని అనుమానించి అగ్నిప్రవేశం చేయించిన ఉదంతానికి సరైన కారణాలు వెదికి , ఆయన లోకకల్యాణం కోసమే చేశాడనిచెప్పిన నోటితోనే మనకి తెల్సిన వారబ్బాయి పెళ్ళికి ముందే అమ్మాయికి సంబంధించి కొన్ని రుజువులు అడిగాడు కాబట్టి వాడు ....ఎదవ .. అలాంటి ఎదవలు ఉన్న భారత దేశం విలువలు లేనిది అని తీర్మానించేస్తాం. రెండు కోట్లకి పైగా యువకులు ఉన్న ఆంధ్ర దేశంలో ఎవడో కౌన్ కిస్కా గొట్టం ఒకడు ( వాడికి తెలిసీ తెలీని వయసులో జరిగిన ఎ సంఘటన వాడి మీద ఎ ప్రభావం చూపిందో) ఏదో తన భార్య శీలవతి అని రుజువు చేసుకోవాలనుకున్నాడు. వాడిని చదువుకుని ఉద్యోగాలు చేసే ఈ తరం అబ్బాయిలకి ప్రతినిధిని చేసేస్తారు కొందరు.
వాడికి కావాల్సింది పెళ్ళాం కాదు మెంటల్ కౌన్సిలింగ్ . వాడి మనసు కి పురుగు పట్టింది. తనలో ఉన్న చెడు కనిపించకుండా వాడు వేసుకున్న ముసుగే సాంప్రదాయం.... బ్లా బ్లా బ్లా .

ఎవడో పర్వర్ట్ ... వాడు కూడ మనిషి కాదు ఒక కధలో పాత్ర ఇండియన్ వాల్యూస్ అంటే అమ్మాయి పెళ్ళికి ముందు శీలవతిగా ఉండడం అన్నాడట. దాన్ని పట్టుకుని కొందరు భారతీయ విలువలని ప్రశ్నిస్తున్నారట.

భారతీయ విలువల గురించి ఒక్క మాట లో చెప్పాలంటే ఒక చిన్న సంఘటన కి సంబంధింఛి చెప్పుకోవచ్చు .

ఒక అబ్బాయి బండి మీద వేగంగా వంకర టింకరగా వెళుతూ ఒక సెంటర్ లో పడ్డాడు అనుకోండి ... మెజారిటీ ప్రజల స్పందన .

ఇండియా లో : చినగా వెళ్ళొచ్చు కదయ్య లేదా అంత తొందరేంటి బాబు లేదా ఏరా సామీ ఇంట్లో చెప్పి వచ్చావా

అమెరికాలో : Asshole or Mother **** er

పాకిస్తాన్ : क्यारे देखके नहीं चलते माके लाव्दे

ఈ తేడా చాలు మన సమాజం విలువ చెప్పడానికి.

చివరిగా ఒక స్కూల్ లో పది మంది చదువుకున్నారు . అందులో ఐదుగురు మంచి స్థాయి వచ్చి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్కుంటూ తమ ఉన్నతికి కారణం ఆ స్కూల్ అని చెప్పుకున్నారు . మరో ఐదుగురు పతనమై పోయి తమ పతనానికి కారణం అదే స్కూల్ అని చెప్పారు యేది నిజం.

తేడా స్కూల్ లో లేదు మనలో ఉంది. అలాగే భారతీయ సమాజం మంచిదే కానీ చూసే దృష్టిని బట్టి అది కనిపిస్తుంది.

( నాదీ మిడి మిడి జ్ఞానమే - తప్పులుంటే సరిచేయగలరు)

11 comments:

Anonymous said...

excellently written srinivas. kudos to you !

btw, in kottapali's story,what if the guy also had 'indian values', then the story wud have been justified.

just to make it worse, the writer took a hypocrite and tried to impose the whole indian society as hypocrites n guys like katti run forward to give some buffoon statements again.

you wrote it very sanely.hats off.

Anonymous said...

evarainaa ee pooripaaka ki daya chesi publicity ivvagalaraa ?

http://pooripaaka.blogspot.com

- pooripaaka fans group.

..nagarjuna.. said...

బాగా చెప్పారు శ్రీనివాస్ గారు. పొలంలో పురుగు కనపడితే మొత్తం పొలమే పాడైందనుకుంటున్నారు పాపం..

Anonymous said...

ఏదో బ్లాగులో చూశాను విలువలంతూ ఓ పోస్ట్ చదవదలుచు కోలేదు. అలాంటాల్లమాటలు మీరూ పట్టించుకోమాకండి. పాత స్వాతిలో రాముడిని ఎవరైనా తిడుతూ రాస్తే అదీ బ్లాగులోకెక్కిస్తారు ఆసంగతి వదిలేసి ఇంకో పాత ఆంధ్రభూమిలో రాముడిని పొగుడుతూ రాస్తే అదీ తెచ్చి బ్లాగులో పెట్టి ఆహా నా ఘనత అంటారు ఓ సొంత అభిప్రాయఊ లేని వాళ్ళ ఆవాకులు చెవాకులు పట్టించుకోనక్కర్లేదు.

Raghav said...

Well said boss

Ravi said...
This comment has been removed by the author.
Amar said...

well said.

Anonymous said...

may be your analysis not that much perfect but its not a copy pasted materiel like those blogs. keep goin

amma odi said...

Well Said.

amma odi said...

ఇంకా కొంచెం పదును పెట్టవచ్చు.

Isaac said...

Well Said.